కరోనా టీకా వేయించుకోండి : భేరి రాంచందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: దేశంలో రోజురోజుకు కొత్త కొత్త ప్రాణాంతక వైరస్ లు వస్తున్నాయని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సామాజిక సేవా రత్న అవార్డు గ్రహీత, నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షుడు భేరీ రామచందర్ యాదవ్ పేర్కొన్నారు . గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్ మొహర్ పార్క్ గ్రంథాలయంలో ఉదయం నుండి సాయంత్రం వరకు నేతాజీ నగర్ కాలనీ ప్రజలకు కరోన నివారణ టీకాలు వేయించారు. ఈ సందర్భంగా భేరి రాంచందర్ యాదవ్ మాట్లాడుతూ కరోనా వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరూ రెండు డోసులు వేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఏ.ఎన్.ఏం అనిత,ఆశా వర్కర్ అరుణ, సుధా రాణి, గుల్ మెహర్ పార్క్ కాలనీ అధ్యక్షులు షేక్ కాసిం, రాజేష్, రంజిత్, రాముడు, కే.నరసింహ యాదవ్, కే.రాము యాదవ్, అరుణ పాల్గొన్నారు.

కరోనా టీకా వేయించుకుంటున్న భేరి రాంచందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here