నమస్తే శేరిలింగంపల్లి: యువత క్రీడల్లో రాణించాలని, మార్షల్ ఆర్ట్స్ వ్యాయామాలు ఎల్లప్పుడూ మన శరీరం బాలెన్స్ ను రూపొందించడంతో పాటు రక్షణ కవచంలా ఉపయోగపడుతాయని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. హఫీజ్ పేట్ డివిజన్ లోని గంగారాం లో నూతనంగా ఏర్పాటు చేసిన తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ కార్యాలయాన్ని కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ కీలకమైన అంశాలుగా ఉంటాయన్నారు. వ్యాయామం, కళ రెండు ఉత్తమ కాంబోగా తయారుచేస్తాయని, ఈ యుద్ధ కళల వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కళను సాధన చేస్తే విశ్వాసం, సంతులనం, బలం, వశ్యత, ధైర్యం వస్తుందని అన్నారు. సాధారణంగా మార్షల్ ఆర్ట్ గా పిలువబడే ఈ కళ అత్యంత ప్రసిద్ధ కళలలో ఒకటి అన్నారు. మార్షల్ నేర్చుకుంటే ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు స్వీయ రక్షణ కోసం, తోటి వారిని రక్షించటానికి ఉపయోగపడుతుందని అన్నారు. అనంతరం కార్పొరేటర్ గత స్మృతులను గుర్తుచేసుకుని 25సంవత్సరాల క్రితం నేర్చుకున్న కళను మాస్టర్ సతీష్ గౌడ్, విద్యార్థులతో కలిసి కొన్ని మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు ప్రదర్శించారు. గాలిలో ప్రదర్శించిన విన్యాసాలు స్థానికులను, అక్కడి వారిని ఆశ్చర్యాన్ని గురిచేశాయి. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రవి కుమార్, గంగారాం టీఆర్ఎస్ బస్తీ అధ్యక్షులు దేవరాజ్, హఫీజ్ పేట్ డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు జ్ఞానేశ్వర్, చిన్న, యూత్ అధ్యక్షులు రోహిత్, మైనారిటీ అధ్యక్షులు ఇస్మాయిల్ ఖాన్, గంగారాం ఎస్సీ సెల్ అధ్యక్షులు అనిల్, యువకులు సంపత్, సంతోష్ తదితరులు ఉన్నారు.
