దోమల నివారణకు జాగ్రత్తలు పాటించాలి : నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు భేరి రాంచందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: కాలనీలో దోమల నివారణకు చర్యలు చేపట్టడం జరుగుతుందని, దోమలు వృద్ధి చెందకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు భేరీ రామచందర్ యాదవ్ పేర్కొన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ కాలనీలో దోమలు నివారణకు ఎంటమాలజీ సిబ్బందితో పాగింగ్ చేయించారు. ఫిర్యాదు చేసిన వెంటనే ఎంటమాలజీ ఏఈ కిరణ్ రెడ్డి స్పందించి ఫాగింగ్ చేయించడం పట్ల బేరి రాంచందర్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. కాలనీలో మురికి కాలువలు, ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని స్థానికులకు భేరి రాంచందర్ యాదవ్ సూచించారు. ఎంటమాలజీ సిబ్బంది అశోక్, రవి, అంజయ్య, కాలనీఉపాధ్యక్షులు రాయుడు, రమేష్ గుప్తా, ఎండి కమర్ పాషా, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

నేతాజీ నగర్ లో దోమల నివారణకు ఫాగింగ్ చేయిస్తున్న భేరి రాంచందర్ యాదవ్

 

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here