నేతాజీ నగర్ కాలనీ సమస్యలు పరిష్కరించండి – ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి వినతి

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీనగర్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు భేరి రాంచందర్ యాదవ్ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి నేతాజీ నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలపై వినతి పత్రం అందజేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అవుట్ లెట్, సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరలో నేతాజీ నగర్ కాలనీలో ఉన్న సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ ఉపాధ్యక్షులు రాయుడు, కె. నరసింహ యాదవ్, బుచ్చయ్య, రవి సింగ్ నాయక్, దినేష్, మోహన చారి, సంజీవ, అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే ‌గాంధీకి వినతిపత్రం అందజేస్తున్న నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here