నేతాజీన‌గ‌ర్‌లో శానిటైజేష‌న్ స్పెష‌ల్ డ్రైవ్‌… వైర‌స్‌ను త‌క్కువ అంచనా వెయ్యొద్దు: భేరి రాంచంద‌ర్ యాద‌వ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: గ‌చ్చిబౌలి డివిజ‌న్ ప‌రిధిలోని నేతాజీన‌గ‌ర్‌లో బుధ‌వారం డీఆర్ఎఫ్ ఆద్వ‌ర్యంలో శానిటైజేష‌న్ స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హించారు. కాల‌నీ సంక్షేమ సంఘం అధ్య‌క్షుడు భెరి రాంచంద‌ర్ యాద‌వ్ డీఆర్ఎఫ్ సిబ్బందిచే ప్ర‌తి వీదిలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావ‌ణాన్ని పిచికారి చేయించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయ‌ని నిర్ల‌క్ష్యం చేయ‌రాద‌ని, నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్న వైర‌స్ మ‌ల్లీ ఎప్పుడైన ఉదృతంగా విస్త‌రించ‌వ‌చ్చ‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే కాల‌నీ వాసులంతా కోవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచించారు. ప్ర‌తి ఒక్క‌రు విధిగా మాస్కులు ధ‌రించాల‌ని, భౌతిక దూరం పాటించాల‌ని, ఏమాత్రం అనారోగ్యంగా అనిపించినా అశ్ర‌ద్ధ చేయ‌కుండా వైద్యుడిని సంప్ర‌దించాల‌ని, వ్య‌క్తిగ‌త‌, ప‌రిస‌రాల‌ ప‌రిశుభ్రత‌పై ప్ర‌త్యేక శ్రద్ధ వ‌హించాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో కాల‌నీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు రాయుడు, స‌భ్యులు పోలీస్ వెంకటేష్, భేరీ చంద్రశేఖర్ యాదవ్, రాము, మల్లేష్, రాజు, అశోక్, లవన్, ఆచారి ప్రభాకర్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

డీఆర్ఎఫ్ సిబ్బందితో క‌ల‌సి నేతాజీన‌గ‌ర్‌లో క‌రోనా క్రిమి సంహార‌క మందు పిచికారి చేస్తున్న భేరి రాంచంద‌ర్‌యాద‌వ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here