శేరిలింగంపల్లి, ఏప్రిల్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని గంగారంలో నూతనంగా ఏర్పాటు చేసిన ముకుంద జ్యువెలర్స్ షో రూమ్ ను ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ గంగారంలో ముకుంద జ్యువెలర్స్ షో రూమ్ ను ఏర్పాటు చేయడం అభినందనీయం అని , ప్రజలకు కావాల్సిన అన్ని రకాల నగలు అందుబాటులో సరమైన ధరలకు లభించడం సంతోషకరమైన విషయం అని అన్నారు. వినియోగదారుల అభిరుచికి తగ్గట్టు నగలు లభించడం గొప్ప విషయం అని, వినియోగదారులు దేవుళ్ళతో సమానము కావున వారి అభిరుచికి తగ్గట్టు వారి మన్ననలు పొంది జ్యువెలర్స్ రంగంలో దినదీనాభివృద్ధి చెంది మార్కెట్ లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని నిర్వాహకులను అభిలాషించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, MD ఇబ్రహీం, నరేందర్ బల్లా తదితరులు పాల్గొన్నారు.