నమస్తే శేరిలింగంపల్లి: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రగతి ఎన్క్లేవ్, ఏఎస్రాజు నగర్లలో గురువారం పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. రోడ్లపై ఉన్న మట్టికుప్పలను, చెత్తా చెదారాన్ని జేసీబీ సహాయంతో తొలగింపజేశారు. పట్టణ ప్రగతి ద్వారా పారిశుధ్యం పనులకు ప్రాముఖ్యత కల్పించి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని అన్నారు. ఆయన వెంట జీహెచ్ఎంసీ అధికారులు, శానిటేషన్ సిబ్బంది ఉన్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2021/07/IMG-20210708-WA0077.jpg)