మియాపూర్ పరిస‌ర ప్రాంతాల్లో శుక్ర‌వారం విద్యుత్ స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: మియాపూర్ స‌బ్‌స్టేష‌న్ 11 కెవి ఫీడ‌ర్ల ప‌రిధిలో మ‌ర‌మ్మ‌తుల కార‌ణంగా శుక్ర‌వారం ప‌లు ప్రాంతాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిపి వేస్తున్న‌ట్టు మియాపూర్ ఏఈ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. కృషిన‌గ‌ర్‌, ఎమ్ఎన‌గ‌ర్‌, స్టాలిన్‌న‌గ‌ర్‌, రాఘ‌వేంద్ర పాంచ‌జ‌న్య అపార్ట్‌మెంట్‌, ఏలియ‌న్ అపార్ట్‌మెంట్‌, ప్ర‌శాంత్‌న‌గ‌ర్‌, హనుమాన్ దేవాల‌య ప్రాంతం, వాట‌ర్ ట్యాంక్ ఏరియా, మ‌ణిసాయి అపార్ట్ మెంట్‌, మిర్రా హాస్పిట‌ల్‌, సాయిరామ్ న‌గ‌ర్‌, అల్లూరి సీతారామ‌రాజున‌గ‌ర్‌, డి.కె.న‌గ‌ర్‌, స్వ‌ర్ణ‌పురి కాల‌నీ, రెడ్డి ల్యాబ్‌, జెపి న‌గ‌ర్‌, మ‌క్తా మ‌హ‌బూబ్‌పేట్‌, క్రిష్ణ‌సాయి ఎన్‌క్లేవ్‌, బికే ఎన్‌క్లేవ్ త‌దిత‌ర ప్రాంతాల్లో ఉద‌యం 9 గం.ల నుండి 11గం.ల వ‌ర‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం ఏర్ప‌డుతుంద‌ని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here