స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మంలో ముందుండాలి: ర‌వికుమార్ యాద‌వ్

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 24 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముందంజలో ఉండాల‌ని బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామా రంగారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. మంగ‌ళ‌వారం మసీదుబండలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ కన్వీనర్ రాఘవేంద్రరావు అధ్యక్షతన నిర్వహించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బాల్దా అశోక్ , కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, రవీంద్ర రావు, కో కన్వీనర్ మణిభూషణ్, సీనియర్ నాయకులు వసంత్ కుమార్, మహిపాల్ రెడ్డి, బుచ్చిరెడ్డి, పాతూరి కరుణ, ముఖ్యనాయకులతో కలిసి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జన్మ దినోత్సవ వేడుకలు అన్ని బూత్ లలో ఘనంగా నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యాలయం పిలుపుమేరకు ప్రతి ఇంటికి వెళ్లి కనీసం 100 మంది సభ్యులను నమోదు చేయాలని సూచించారు.

ప్రతి నాయకుడు, కార్యకర్త సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్య భూమిక పోషించి దిగ్విజయంగా పూర్తి చేయాలన్నారు. డివిజన్ల వారీగా నియమించిన ఇంచార్జులు బూత్ స్థాయి నాయకులకు అండగా ఉంటారని తెలిపారు. క్రియాశీల నాయకులు కావాలనే ప్రతి ఒక్కరూ 2000 నుండి 10000 మంది సభ్యులను నమోదు చేయించాలన్నారు, టోల్ ఫ్రీ నంబర్ 8800002024 కు మిస్డ్ కాల్ ఇప్పించి తద్వారా వచ్చిన లింక్ లో వారి వివరాలను పూర్తి చేయించాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here