ఉత్సవ మేళాను ప్రారంభించిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని మియాపూర్ ప్రధాన రహదారి పై సితార గ్రాండ్ హోటల్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఉత్సవ మేళాను మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు.

ఉత్సవ మేళాను ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

ఇక్కడి ప్రాంత ప్రజల‌ కోసం ఇలాంటి ఉత్సవ మేళాను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పెట్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, మియపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు కిరణ్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు బాలింగ్ యాదగిరి గౌడ్, కృష్ణ ముదిరాజ్, నరేందర్ గౌడ్, నాయుడు, తిరుపతి, రజినీకాంత్, నిర్వాహకులు సమీర్, అమీర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here