మతి స్థిమితం లేని వ్యక్తి అదృశ్యం

నమస్తే శేరిలింగంపల్లి: పని కోసం ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నల్లగండ్ల హుడా లేఅవుట్ కాలనీలో కూలీ ప‌ని చేసుకుంటూ వడ్డె లక్ష్మీ కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు. మతిస్థిమితం సరిగా లేని వడ్డె లక్ష్మణ్ తన భార్యతో గొడవపడి విడిపోయి అక్క లక్ష్మీ వద్దనే కూలీ పని చేస్తూ ఉంటున్నాడు. ఈ నెల 8 వ తేదీన ఇంటి నుంచి పని కోసం వెళ్లిన లక్ష్మణ్ పని ప్రదేశ‌ంలో కడుపు నొప్పి వస్తుందనడంతో ఆటో ఎక్కి పంపించామని స్నేహితుడు లక్ష్మీకి ఫోన్ చేసి చెప్పాడు. ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో వడ్డె లక్ష్మీ ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ వెంకటయ్య తెలిపారు. వివరాలు తెలిసినవారు 9490617118, 7901113097, 9490617100, 04027853911,100 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.

అదృశ్యమైన వడ్డె లక్ష్మణ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here