నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి సబ్ డివిజన్ పరిధిలోని సబ్ స్టేషన్ల పరిధిలో గల ఆయా ప్రాంతాల్లో ఈ‌ నెల 16 న విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుందని గచ్చిబౌలి సబ్ డివిజన్ ఏడీఈ ఆపరేషన్ సతీష్ కుమార్ తెలిపారు. చెట్ల కొమ్మలను తొలగించనున్న దృష్ట్యా ఆయా ఫీడర్ల పరిధిలోని కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు. శాంతినగర్ ఫీడర్ 11 కెవి పరిధిలోని శాంతి నగర్, జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ 21 కార్యాలయం, కడిమి ఆస్పత్రి, హుడా కేఫ్ ఏరియాలలో‌ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తారానగర్ 11 కెవి ఫీడర్ పరిధిలోని పీజేఆర్ స్టేడియం, టెలిఫోన్ కాలనీ, శివాజీ నగర్, తారానగర్ మజీద్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేయడం జరుగుతుందని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి సహకరించగలరని విజ్ఞప్తి చేశారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here