మేకల జయరాజు యాదవ్ మృతి యాదవ సంఘానికి తీరని లోటు

  • భేరి రామచందర్ యాదవ్

మాదాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ డివిజన్ ప‌రిధిలోని ఖానామెట్ వాసి మేకల జయ రాజ్ యాదవ్ అంత్యక్రియల్లో అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు భేరి రామ‌ చందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మేకల జయరాజు యాదవ్ కు రామ‌చంద‌ర్ యాద‌వ్ నివాళులు అర్పించారు. అనంత‌రం భేరి రామ‌ చందర్ యాదవ్ మాట్లాడుతూ.. మేకల జయ రాజ్ యాదవ్ యాదవ సంఘంలో కీలక పాత్ర పోషించార‌ని అన్నారు. యాదవుల ఐక్యత కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేశార‌న్నారు. మేకల జయరాజు యాద‌వ్ మృతి తీరని లోట‌ని అన్నారు.

మేకల జయరాజు యాదవ్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన భేరి రామచందర్ యాదవ్

అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర యాదవ సంఘం సభ్యుల తరఫున మేకల జయరాజు యాదవ్ కి శ్రద్ధాంజలి ఘ‌టించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మారబోయిన భిక్షపతి యాదవ్, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి జగదీశ్వర్ గౌడ్, గంగాల నరసింహ యాదవ్, జంగయ్య యాదవ్, ఒంగోలు శ్రీనివాస్ యాదవ్, గణేష్ యాదవ్, మై పాల్ యాదవ్, మాదాపూర్ డివిజన్ యాదవ సంఘం అధ్యక్షుడు చందు యాదవ్, బాలరాజు యాదవ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here