సత్యసాయిసేవా సమితి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎంఏ నగర్ ప్రాథమికోన్నత పాఠశాల లో శ్రీ సత్య సాయి సేవా సమితి ప్రశాంత్ నగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ సత్య సాయి సేవా సమితి ప్రశాంత్ నగర్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పుట్టపర్తి సత్య సాయి సెంట్రల్ నుండి ప్రత్యేక వాహనం వచ్చి ఉచిత వైద్య సేవలు అందజేయడం సంతోషకరమని అన్నారు. ఈ వైద్య శిబిరంలో 400 మందికి పైగా ఉచిత వైద్య సేవలు అందించారు. ఈ ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహించిన నిర్వాహకులను ప్రత్యేకంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అభినందించారు. ఈ కార్యక్రమంలో సత్య సాయి సేవా సమితి సేవకులు, టీఆర్ఎస్ నాయకులు కాజా, మల్లేష్, శివ తదితరులు పాల్గొన్నారు.

మెడికల్ క్యాంపును పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here