టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్లన్నీ పూర్తి: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్

నమస్తే శేరిలింగంపల్లి:టీఆర్ఎస్ పార్టీ ద్వి దశాబ్ది వేడుకల్లో భాగంగా హైటెక్స్ లో ఈ నెల 25న నిర్వహించే పార్టీ ప్లీనరీ సమావేశం ఏర్పాట్ల ను, సభ వేదిక ప్రాంగణం ను, భోజన శాల ఏర్పాట్లను, వాహనాల పార్కింగ్ అన్ని ఏర్పాట్లను రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, ఎమ్మెల్సీ నవీన్ రావు, టీఎస్ఐసీసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, మాజీ మేయర్ బొంతు రాం మోహన్, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు. ప్లీనరీ ఏర్పాట్లు అన్ని త్వరితగతిన పూర్తి చేయడం జరిగిందని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. ప్లీనరీ సమావేశానికి వచ్చే ప్రజా ప్రతినిధుల కోసం చేస్తున్న ఏర్పాట్లు, సభావేదిక, పార్కింగ్ ఏర్పాట్లు అన్నీ బాగున్నాయని కొనియాడారు. ప్లీనరీకి వచ్చే ప్రజా ప్రతినిధులు, నాయకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు, భోజన వసతి కల్పించడం జరిగిందన్నారు. మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు రాంచందర్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.

టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ‌సమావేశం ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎంపీ సంతోష్ కుమార్, తదితరులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here