శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ బస్తీలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఏర్పాటు చేయనున్న ఆలయ ద్వారం పూజ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, నియోజకవర్గం నాయకులు, స్థానిక ప్రజలతో కలిసి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర లేబర్ సెల్ ఉపాధ్యక్షుడు నల్ల సంజీవ రెడ్డి, పట్వారీ శశిధర్, రవి, జిల్లా గణేష్, ప్రభాకర్, సమ్మ రెడ్డి, సంగమేష్, రెహ్మాన్, శివ, వాసు, తిరుపతి, మోహన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మహిళా కాంగ్రెస్ శ్రీదేవి, శిరీష సత్తూర్, మానెమ్మ, అరుణ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.






