మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీలోని ఏఆర్కే టవర్స్ అసోసియేషన్ సభ్యులు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ను సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ తన గెలుపుకు ఎంతగానో కృషి చేసిన అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ జనరల్ సెక్రటరీ చంద్రిక ప్రసాద్ గౌడ్, అసోసియేషన్ సభ్యులు, అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు.

మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ గా ఎన్నికైన ఉప్పలపాటి శ్రీకాంత్ ని ఎంఏ నగర్, న్యూ కాలనీ, రాధ మాధవ్ సొసైటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.








