శేరిలింగంపల్లి, మే 6 (నమస్తే శేరిలింగంపల్లి): మే 20వ తేదీన జరగనున్న దేశ వ్యాప్త సమ్మె కారణంగా బహుజన, వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ (అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య) ఆధ్వర్యంలో అంజయ్య భవన్లో ఉన్న లేబర్ కమిషనర్ కార్యాలయంలో సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా అఖిల భారత కార్మిక సంఘాల కేంద్రం (ఏ.ఐ.సి.టి.యు ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తుడుం అనిల్ కుమార్ మాట్లాడుతూ కార్మికులు కొట్లాడి సాధించుకున్న కార్మిక చట్టాలను, హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 యాజమాన్య అనుకూల కోడ్లుగా మార్చి శ్రమ దోపిడీకి పాల్పడుతూ, దేశ సంపదనంతా కార్పొరేట్, పెట్టుబడిదారులకు కట్టపెట్టుతున్నదని, బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ బహుజన కార్మిక వర్గానికి కనీస వేతనం రూ 30 వేలు అమలు చేయాలని, ఈపిఎఫ్ పెన్షన్ 15 వేలు అమలు చేయాలని, బహుజన కార్మిక వర్గానికి వ్యతిరేకంగా బిజెపి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మెలో బహుజన కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలోఅఖిల భారత కార్మిక సంఘాల కేంద్రం ఏఐసిటియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తుడుం అనిల్ కుమార్ , బహుజన వామపక్ష కార్మిక సంఘాల JAC నాయకులు ప్రసాద్ , కర్ర దానయ్య, రవి , సిద్ది రాములు , ఖలీల్, ప్రసాద్, చంద్రమౌళి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.