కారు ఢీకొని గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృతి

శేరిలింగంపల్లి, మే 6 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): కారు వేగంగా వ‌చ్చిన ఢీకొన్న సంఘ‌ట‌న‌లో ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృతి చెందాడు. చందాన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకున్న ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. శేరిలింగంప‌ల్లిలోని ఆలిండ్ కంపెనీ వ‌ద్ద మంగ‌ళ‌వారం ఉద‌యం 4 గంట‌ల‌కు అతి వేగంగా వ‌చ్చిన ఓ కారు ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తిని ఢీకొట్టింది. దీంతో ఆ వ్య‌క్తి అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించి కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఆ వ్య‌క్తి వ‌య‌స్సు సుమారుగా 55 సంవ‌త్స‌రాలు ఉంటుంద‌ని, అత‌ను స్థానికంగా యాచ‌కుడిగా జీవ‌నం సాగిస్తుండ‌వ‌చ్చ‌ని, ఎవ‌రైనా గుర్తు ప‌ట్ట‌ద‌లిస్తే త‌మ‌ను సంప్ర‌దించాల‌ని పోలీసులు సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here