పట్టణ ప్రగతితో అభివృద్ధి సాధ్యం – మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మాదాపూర్ డివిజన్ పరిధిలో స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని దోబి ఘాట్ లో అధికారులతో కలిసి పాదయాత్ర చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ సూచించారు. బస్తీలలో, కాలనీలలో ఉన్న చెత్తను తొలగించడం, డ్రైనేజీ వ్యవస్థను శుభ్ర పరచడం, మురికి నీటి గుంతలను తొలిగింపజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈ ప్రశాంతి, వాటర్ వర్క్స్ మేనేజర్ నివర్థీ, శానిటేషన్ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక నాయకులు శ్యామ్, భుజంగం, వార్డు సభ్యులు రాంచందర్, గుమ్మడి శ్రీనివాస్, రాందాస్, రామాంజనేయులు, ఉన్నూర్, గోవింద్, హరికృష్ణ, రాహుల్, కొండయ్య, సుబ్రమణ్యం, నాగరాజు, నర్సింహ మూర్తి, బాబు రావు, వర్క్ ఇన్‌స్పెక్టర్ చారి, ఎలక్ట్రికల్ విభాగం ప్రేమ, శానిటేషన్ ఎస్ఎఫ్ఏ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

పట్టణ ప్రగతిలో పరిసరాలను పరిశుభ్రం చేయిస్తున్న కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here