కరుణామయుడు ఏసు క్రీస్తు – క్రిస్మస్ వేడుకల్లో ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: శాంతిమయుడు, కరుణామయుడు ఏసు క్రీస్తు అని, ఏసు క్రీస్తు జన్మించి ఎంతోమందికి సరైన మార్గం చూపి ఆధ్యాత్మికత అలవరిచారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజ్జత్ నగర్ కాలనీలో ప్రభు ట్రూ లైట్ చర్చిలో క్రిస్టమస్ పర్వదిన సందర్భంగా నిర్వహించిన క్రిస్టమస్ వేడుకలలో కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్ ను కట్ చేసి క్రిస్టియన్లందరికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ చాలా పవిత్రమైన పండుగ అని, శాంతియుత వాతావరణంలో సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మతాలకు సమ ప్రాధాన్యం కల్పిస్తూ లౌకిక రాష్ట్రంగా పేరుగాంచిందన్నారు. ప్రతి సంవత్సరం కేసీఆర్ ప్రభుత్వం క్రిస్మస్ కానుకలను పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, నాయకులు రాంచందర్, గౌస్, లోకేష్, సంతోష్, శ్యామ్, కృష్ణ, రంగస్వామి, లింగం, కోటి, కేశవులు, సీత, పాస్టర్ రాజు, క్రైస్తవ సోదర సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ గాంధీ

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here