జాతీయ‌ జెండాలతో బిజెపి నాయకుల బైక్ ర్యాలీ – మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమాన్ని చేపట్టారని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా‌ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవం 75వ స్వాతంత్ర వేడుకల్లో భాగంగా ఆల్విన్ కాలనీ తులసి వనం నుండి వివేకానంద నగర్ డివిజన్ లోని పలు కాలనీల‌‌ వరకు పుష్పంధర్, జోయల్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో బిజెపి నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధులను దేశ ప్రజలు గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యక ఎంతైనా ఉందన్నారు. బిజెపి శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జీ యోగానంద్,
బిజెవైఎం నేషనల్ ట్రెజరర్ సాయి ప్రసాద్, రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు ఉప్పల ఏకాంత్ కుమార్, మేడ్చల్ అర్బన్ జిల్లా సెక్రటరీ విజిట్ వర్మ, బిజెపి సీనియర్ నాయకులు హాజరయ్యారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ లో పాల్గొన్న మాజీ ఎంపీ‌ కొండా విశ్వేశ్వర్ రెడ్టి, బిజెపి నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here