వివేకానందనగర్ (నమస్తే శేరిలింగంపల్లి): భారతీయ జనత పార్టీలో చేరిన కుత్భుల్లాపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ను వివేకానంద నగర్ డివిజన్ బిజెపి ఇంచార్జ్ ఉప్పల విద్యా కల్పన ఏకాంత్ గౌడ్ డివిజన్ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆదివారం గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూన శ్రీశైలం గౌడ్ రాక స్థానిక బిజెపి శ్రేణుల్లో ఎంతో ఉత్సాహం నింపిందని, వారి రాకతో మేడ్చెల్ మల్కాజ్గిరి జిల్లాలో బిజెపి బలపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ జన్ సైదులు, విశాల, శాలిని, అరుణ, కావ్య,తేజస్విని, ఉప్పల శృతి, హేతేషి, భాను యాదవ్, దయాకర్రెడ్డి, గణేష్ గౌడ్,సంతోష్ కుమార్, వెంకటేష్, యాదగిరి, జితేందర్, నవీన్, మార్ల శీను, నాగరాజు, వినోద్, మహేందర్, బొట్టు శ్రీను, విర రాజు గౌడ్, మురళి గౌడ్ , అరవింద్ యాదవ్,రాజు, నాగరాజు, శేఖర్ రెడ్డి ,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
