కొండాపూర్ జిల్లా ద‌వాఖానాను సంద‌ర్శించిన ప్ర‌త్యేక అధికారి వంశీమోహ‌న్‌… వైద్యసేవ‌లు, భోజ‌నం పంపిణీపై ఆరా…

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ జిల్లా దవాఖానా ప్రత్యేక అధికారి, శేరిలింగంపల్లి తహసీల్దార్ వంశీమోహన్ శుక్ర‌వారం హాస్పటల్‌ను సందర్శించారు. దవాఖానాలో అందుతున్న క‌రోనా చికిత్సపై ఆయన ఆరా తీశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రోగులకు అందిస్తున్న భోజనాన్ని ఆయన పరిశీలించారు. రుచి, శుభ్రత, నాణ్యత గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వంశీమోహన్ మాట్లాడుతూ జిల్లా దవాఖానాలో రోగుల‌కు అవ‌స‌ర‌మైన వైద్య సేవలతో పాటు సకాలంలో భోజనం అందుతుందని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. తహసిల్దార్ వెంట డిప్యూటీ త‌హ‌సీల్దార్‌ శంకర్, ఆర్ఐ చంద్రారెడ్డి, వీఆర్ఏ నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

భోజ‌నం గురించి రోగుల‌ను ఆరా తీస్తున్న కొండాపూర్ హాస్పిట‌ల్ ప్ర‌త్యేక అధికారి, తహసీల్దార్ వంశీమోహ‌న్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here