టిమ్స్ వద్ద ధర్నాకు బయలుదేరిన బిజేపి నేతలు గోవర్ధన్ గౌడ్, మహిపాల్ రెడ్డిల అరెస్ట్…

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి టిమ్స్ హాస్పిటల్ లో కోవిడ్ రోగులకు సరైన వైద్యం అందడం లేదని బిజెపి జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి బయలుదేరిన పార్టీ నాయకులును పోలీసులు అడ్డుకున్నారు. రంగారెడ్డి అర్భన్ జిల్లా ప్రధానకార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్, సీనియర్ నాయకుడు తోపుగొండ మహిపాల్ రెడ్డిలను లింగంపల్లిలోని గోవర్ధన్ గౌడ్ ఇంటి దగ్గర గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ రోగుల కొరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన టిమ్స్ హిస్పిటల్ లో ఆక్సీజన్ అందక, వైద్య సిబ్బంది సరిగ్గా లేక అనేక మంది చనిపోతున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిలదీస్తూ నిరసన తెలపడానికి వెళ్తున్న తమను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కరానా కట్టడి, రోగులకు వైద్యం అందించే విషయంలో విఫలమైన టీఆర్ఎస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

చింతకింది గోవర్ధన్ గౌడ్, తోపుగొండ మహిపాల్ రెడ్డిలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here