కొండాపూర్ డీఈ గ‌రుత్మంత‌రాజుకు సైబ‌ర్ సిటి స‌ర్కిల్ 327 యూనియ‌న్ అభినంద‌న‌లు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: సైబర్ సిటీ సర్కిల్ ప‌రిధిలోని కొండాపూర్ డివిజన్ డీఈగా విధులు నిర్వ‌హిస్తున్న‌ నరేందర్ రెడ్డి గారు బదిలీ కాగా వారి స్థానంలో కొత్త‌గా‌ గరుత్మంత రాజు భాద్య‌త‌లు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా సైబ‌ర్ సిటీ స‌ర్కిల్‌ 327 యూనియన్ అధ్య‌క్షుడు కె.వెంక‌టేశ్వ‌ర్లు బృందం గ‌రుత్మంత‌రాజును మ‌ర్యాద పూర్వ‌కంగా క‌‌లిసి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ కొండాపూర్ డివిజ‌న్‌లోని వినియోగదారుల సౌక‌ర్యార్ధం డీఈకి అన్నిర‌కాలుగా స‌హ‌కారం అందిస్తామ‌ని వారు తెలిపారు. కొండాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ ఎస్ రమేష్, గచ్చిబౌలి డివిజన్ ప్రెసిడెంట్ వెంకట్రాంరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేందర్, కొండాపూర్ డివిజన్ ట్రెజ‌ర‌ర్‌ సరస్వతమ్మ, జూనియర్ లైన్మెన్‌లు తిరుప‌తి, సంతోష్ రాజశేఖర్, శైలజ త‌దిత‌రులు పాల్గొన్నారు

డీఈ గ‌రుత్మంత రాజుకు శుభాకాంక్ష‌లు తెలుపుతున్న వెంక‌టేశ్వ‌ర్లు బృందం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here