కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం: భేరి రామ‌చంద‌ర్ యాద‌వ్

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 27 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నేతాజీ నగర్ బిసి ఐక్యవేదిక ఆఫీసులో బేరి రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీని స్మరించుకుంటూ బాపూజీ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న విషయాలు, అదే రకంగా 1949లో క్విట్ ఇండియా ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న విషయాలు, తెలంగాణ ఉద్యమంలో తనదైన శైలిలో మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి తెలంగాణ కోసం చేసిన‌ త్యాగశీలత గురించి చెప్పారు. కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు స్ఫూర్తిదాయకం, చిరస్మరణీయం అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, జిల్లా అధ్యక్షుడు మధు యాదవ్, నేతాజీ నగర్ కాలనీ సైదులు, కే నరసింహ యాదవ్, రజక సంఘం రాజు, యువజన సంఘం నాయకులు బాలు, అశోక్, కృష్ణ, రమేష్, రాఘవేంద్ర, సుబ్రహ్మణ్యం, రామకృష్ణ గౌడ్, అంకమ్మరావు, మేస్త్రి సాగర్, దేవేందర్ ముదిరాజ్ పాల్గొన్నారు.

కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీకి నివాళులు అర్పిస్తున్న నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here