శేరిలింగంపల్లి, మే 5 (నమస్తే శేరిలింగంపల్లి): జిల్లెల గూడ జే వై ఆర్ కన్వెన్షన్ లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, మహేశ్వరం శాసనసభ్యురాలు పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి జన్మదిన వేడుకలకు శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సబితా ఇంద్రా రెడ్డిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో దారుకుపల్లి నరేష్, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.