ప్ర‌జా సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆద‌ర్శం: ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ శుక్ర‌వారం ల‌బ్ధిదారుల‌కు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ సంక్షేమ ప్రభుత్వంగా పేరుగాంచిందని, సంక్షేమ పథకాలకు ఏ లోటూ రాకుండా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందంటే సీఎం కేసీఆర్ పనితీరుకు నిదర్శనం అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ల‌బ్ధిదారుల‌కు క‌ల్యాణ‌ల‌క్ష్మి చెక్కును అంద‌జేస్తున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ, నాయ‌కులు ఆద‌ర్శ్ రెడ్డి, ఎర్ర‌గుడ్ల శ్రీనివాస్ యాద‌వ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here