సూర్యచంద్రులున్నంత వరకు జయశంకర్ సార్ ఖ్యాతి నిలిచి ఉంటుంది: జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ సిద్దాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ గారి జయంతిని పురస్కరించుకుని శుక్రవారం లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద గల జయశంకర్ సార్ విగ్రహానికి మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు‌. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ సార్ కృషి ఎన్నటికి మరువలేనిదని అన్నారు. ఉద్యమ సమయంలో ప్రత్యర్థుల ఎత్తుగడలను కట్టడి చేయడంలో ఆయన అందించిన సూచనలు సలహాలు అద్వితీయమని అన్నారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు జయశంకర్ సార్ ఖ్యాతి నిలిచి ఉంటుందని అన్నారు.

జయశంకర్ సార్ కు నివాళి అర్పిస్తున్న కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here