ఉద్యమ స్ఫూర్తిని నింపిన మహోన్నతుడు – ఉద్యమకారుల ఆధ్వర్యంలో జయశంకర్ సార్ జయంతి

నమస్తే శేరిలింగంపల్లి: మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన మహోన్నతుడు, తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సేవలు రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరవరని శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉద్యమకారులు మిద్దెల మల్లారెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సర్ జయంతిని పురస్కరించుకొని హఫీజ్ పేట్ డివిజన్ పరిధి మంజీరా రోడ్డులోని 100 ఫీట్ రోడ్ వద్ద జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య జయశంకర్ సార్ పాత్ర మరవలేనిదని అన్నారు. ఆయన అడుగుజాడల్లో పయనిస్తూ బంగారు తెలంగాణ పునఃనిర్మాణంలో‌ ప్రతి ఒక్కరం భాగస్వాములవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మిద్దెల మల్లారెడ్డి గారితో పాటు గంగారం సంగారెడ్డి, నిమ్మల శేఖర్ గౌడ్, షేక్ జమీర్, రమణ, యాదగిరి, ప్రశాంత్, హనీఫ్, బాబు మోహన్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

జయశంకర్ సర్ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న ఉద్యమకారులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here