నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ మక్త మహబూబ్ పేట్ లో ఆలివ్ మెడికల్ డయాగ్నస్టిక్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ను బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల కోసం ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఆలివ్ మెడికల్ డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాహకులను అభినందించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల, సమాజం పట్ల ఎప్పటికప్పుడు శ్రద్ధ చూపించాలని, ఇలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో పేద ప్రజలకు సేవ చేయాలని సూచించారు. అన్ని రకాల వైద్యపరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు నందిని, సాయి సురేష్, గణేష్ ముదిరాజ్, లక్ష్మణ్, జె. శ్రీను, మల్లేష్, శివరాజ్, జె.రాము, వినోద్ యాదవ్, బాబు, రామకృష్ణారెడ్డి, శివ తదితరులు పాల్గొన్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2022/08/IMG-20220806-WA0080.jpg)
ఘనంగా సుష్మా స్వరాజ్ వర్ధంతి
తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ వర్ధంతి సందర్భంగా మియాపూర్ డివిజన్ మక్త మహబూబ్ నగర్ లో ఆమె చిత్రపటానికి రవికుమార్ యాదవ్ పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీకి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమె చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.