జన్మభూమి కాలనీలో రవికుమార్ యాదవ్ పాదయాత్ర

నమస్తే శేరిలింగంపల్లి: ఆల్విన్ కాలనీ డివిజన్ జన్మ భూమి కాలనీలో డ్రైనేజీ సమస్యలను రోడ్డు సమస్యలను వెంటనే పరిష్కరించాలని బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆల్విన్ కాలనీ డివిజన్ జన్మ భూమి కాలనీలో కంటెస్టెడ్ కార్పొరేటర్ రవీందర్ రావు తో కలిసి రవికుమార్ యాదవ్ పాదయాత్ర చేశారు. కాలనీలో‌ నెలకొన్న ‌సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ , రోడ్ల సమస్యతో పాటు చెత్త సేకరణ సరిగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజల ద్వారా తెలుసుకున్న రవికుమార్ యాదవ్ తక్షణమే మున్సిపాలిటీ వారితో మాట్లాడి, దోమల నివారణ కొరకు ఫాగింగ్ చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి స్థలాల కబ్జాలకు ఎగబడ్డారని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో‌ టీఆర్ఎస్ కు ప్రజలు‌ తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో రవీందర్ రావు, నర్సింగ్ యాదవ్, కమలాకర్, శ్రీనివాసులు, రమేష్, చారి, సుబ్బారావు, రఘు, రాజు, రామచంద్రులు, మధుసూదన్, సతీష్, నర్సింహా రెడ్డి, గురునాథ్, రమణ బాబు, విష్ణు, సందీప్, సుదర్శన్ యాదవ్, నీలాంబర్, హరికృష్ణ, మోహన్ గౌడ్, సందీప్, జలంధర్, కృష్ణశర్మ, సాయిచంద్, అభిషేక్, వెంకట్ రెడ్డి, కె.శ్రీనివాస్ గౌడ్, కె.ఏడుకొండలు, సురేష్, పి.శ్రీనివాస్, జె.శ్రీనివాస్, శ్యామ్ గౌడ్, రామ కృష్ణ, లక్ష్మి, పృథ్వి ధర రావు, అనిల్,‌ నర్సింగ్ రావు , యేసు రత్నం, చంద్ర శేఖర్, ప్రవీణ్, ఇక్బాల్, అనసూయ తదితరులు పాల్గొన్నారు.

జన్మభూమి‌ కాలనీలో‌‌ అధ్వాన్నంగా ఉన్మ డ్రైనేజీని పరిశీలిస్తున్న రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here