ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పరామర్శ

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ గుట్టల బేగంపేట్ వడ్డెర బస్తీలో కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురైన భాదితులను మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తీకి సరఫరా అయ్యే నీరు కలుషితమవడం వలన బస్తీ వాసులు‌ రాత్రి నుండి వాంతులు, విరేచనాలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని, ప్రజలకు అన్నివిధాల టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆదుకుంటామని అన్నారు.‌ శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ ఆదేశాల మేరకు బాధితులను ఆస్పత్రిలో పరామర్శించినట్లు‌ చెప్పారు. ఆయన వెంట మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఏఎంహెచ్ఓ కార్తిక్ ఉన్నారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తున్న కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here