వెంక‌టేశ్వ‌ర స్వామికి ఘ‌నంగా జన్మనక్షత్రం పూజ‌లు

చందాన‌గ‌ర్‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందాన‌గ‌ర్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో కార్తీకమాస‌ శనివారం శ్రీవారి జన్మనక్షత్రం శ్రవణం సందర్భంగా స్వామివారికి సుప్రభాత సేవ, సాలగ్రామార్చన, బాలబోగం నివేదన కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. అలాగే విశ్వ‌క్సేన‌‌ పూజ, పూజ్యవాహచనం, స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పంచామృత అభిషేకం, విశేష పుష్ప అలంకారం, 21 రకాల పుష్పాలతో మహా పుష్పయాగం నిర్వ‌హించారు. ఆలయ ప్రధాన అర్చకుడు సత్యసాయి చేతుల మీదుగా వైఖానస ఆగమం అనుస‌రించి వైఖానస ఆగమ పండితుడు కండవల్లి సూర్యనారాయణ, ఆయ‌న శిష్యబృందం ఆధ్వ‌ర్యంలో పూజ‌లు నిర్వ‌హించారు. జూబ్లీహిల్స్‌కు చెందిన కె.సత్యనారాయణ రాజు, ఝాన్సీ ల‌క్ష్మి దంపతుల ఆధ్వ‌ర్యంలో పూజ‌లు చేప‌ట్టారు. ఈ పూజా కార్య‌క్ర‌మాల‌కు భ‌క్తులు అధిక సంఖ్య‌లో హాజరై తీర్థ ప్ర‌సాదాల‌ను, అన్న ప్ర‌సాదాన్ని స్వీక‌రించారు.

పూజ‌ల సందర్బంగా స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబై ద‌ర్శ‌న‌మిస్తున్న వెంక‌టేశ్వ‌ర స్వామి వారు, అమ్మ‌వారు

 

పూజ‌లు చేస్తున్న పండితులు
21 రకాలు 700 కిిిిలోల పువ్వులతో శ్రీవారికి పుష్పయాగం
పాల్గొన్న భ‌క్తులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here