జ‌న‌ప్రియ ఫేజ్ 1లో నాలా విస్త‌ర‌ణ ప‌నుల‌ను ప‌రిశీలించిన కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: హ‌ఫీజ్‌పేట్‌ డివిజన్ పరిధిలోని ఖాయిద‌మ్మ‌ కుంట చెరువు నుండి సితార హోటల్ వరకు రూ.8.00 కోట్లతో నాల విస్తరణలో భాగంగా జనప్రియ ఫేజ్‌ 1 వద్ద జరుగుతున్న నాల విస్తరణ పనులను స్థానిక నాయకులు, ప్రజలతో కలిసి మాదాపూర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ వి.జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్ మంగ‌ళ‌వారం ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఖాయిద‌మ్మ కుంట దిగువ‌లోని ముంపు ప్రాంతాల‌ను దృష్టిలో ఉంచుకోని నాలా విస్త‌ర‌ణ ప‌నులు చేప‌డుతున్న‌ట్టు తెలిపారు. ఈ నిర్మాణం పూర్త‌వుతే జ‌న‌ప్రియ ప‌రిసర ప్రాంతాల‌కు ఎంతో ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంద‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు కనకమామిడి వెంకటేష్ గౌడ్, జనప్రియ నగర్ అధ్యక్షులు శాంతయ్య, నాయకులు శ్రీనివాస్ గౌడ్, ఉమామహేశ్వరరావు, రవి, శ్రీనివాస్, సురేష్, ఉమేష్, భాస్కర్ రావు, శ్రీనివాస్ రావు, రామ్ బాబు, రామ్ సుందర్, పద్మ తదితరులు పాల్గొన్నారు.

నాలా విస్త‌ర‌ణ ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌, వార్డు మెంబ‌ర్ క‌న‌క‌మామిడి వెంక‌టేష్ గౌడ్ త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here