శేరిలింగంపల్లి, మే 28 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీ గౌతమి స్కూల్ దగ్గరలో ఉన్న మెయిన్ వాల్ పొంగిపోయిందని వాటర్ వర్క్స్ మేనేజర్ సందీప్ కుమార్ కి తెలియజేయగానే వెంటనే స్పందించి పొంగిన మ్యాన్ హోల్ తీసి కొత్త మ్యాన్ హోల్ వేశారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందికి కొండాపూర్ డివిజన్ వార్డు మెంబర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రక్తపు జంగం గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.