శేరిలింగంపల్లి, ఏప్రిల్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): మన భవిష్యత్తు తరాలకు ఆస్తులు కాదు మంచి ఆరోగ్యం , ప్రశాంత జీవితం ఇవ్వాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువు, నాయనమ్మ కుంట చెరువు, మక్తా మహబూబ్ పేట్ లోని పెద్దకుడి చెరువుల సుందరీకరణలో భాగంగా Nexus select Malls కంపెనీ, IGUS, HDFC బ్యాంక్ CSR ఫండ్స్ ద్వారా మల్లిగవాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా చేపట్టనున్న చెరువుల పునర్జీవనంలో భాగంగా సుందరీకరణ, పునరుద్ధరణ పనులను మల్లిగవాడ్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ చెరువుల కట్టల చుట్టూ చెట్లు పెంచి చెరువుల చుట్టూ ఉన్న కాలనీల వారికి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని, చెరువుల సుందరీకరణ లో భాగంగా చెరువుల కట్టలను పటిష్ట పరిచేలా పునరుద్ధరణ,మురుగు నీరు చెరువు లో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి కాల్వ (UGD) నిర్మాణం, అలుగు మరమ్మత్తులు, చెరువు కట్ట బలోపేతం, పునరుద్దరణ పనులు, వాకింగ్ ట్రాక్ నిర్మాణాలను చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లిగవాడ్ ఫౌండేషన్ సభ్యులు రామ్, చైతన్య, స్థానిక నాయకులు, మియాపూర్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు సుప్రజ, భార్గవ్, కిషోర్, రవి, నాగిరెడ్డి, రామిరెడ్డి, శ్రీధర్, ఈశ్వర్ నాయుడు, రాణి, నరసింహ రాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.