బీసీల‌కు అధికారం ద‌క్కాలంటే బీపీ మండ‌ల్ సిఫార‌సుల‌ను అమ‌లు చేయాలి: భేరి రామచందర్ యాదవ్

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 28 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): సంగారెడ్డి జిల్లా డాక్టర్ బి పాండురంగారావు యాదవ్ యాదవ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రాజకీయ అవగాహన తరగతులు నిర్వహించిన కార్యక్రమంలో విద్యావంతుల రాష్ట్ర అధ్యక్షుడు చలకాని వెంకట్ యాదవ్, యాదవ్ విద్యావంతుల రాష్ట్ర గౌరవ సలహాదారు భేరి రామచందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ యాదవులకు, బీసీలకు విద్యా, ఉద్యోగ రంగాలలో అధికారం రావాలంటే బీపీ మండల్ 40 సిఫారసులకై పోరాటం చేయాలని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో బీపీ మండల్ విగ్రహాలు పెట్టాలి అని అన్నారు. యాదవులు, బీసీలు ఏకమై బీపీ మండల్ ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. బీపి మండల్ కు భారతరత్న ఇవ్వాల‌ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిపి మండల్ జయంతి, వర్ధంతిల‌ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అందెల కుమార్ యాదవ్, సంగారెడ్డి జిల్లా విద్యావంతుల వేదిక ఉపాధ్యక్షుడు శివ కుమార్ యాదవ్, బేరి చంద్రశేఖర్ యాదవ్, మహిళ‌లు, యువజన నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here