శేరిలింగంపల్లి, మే 14 (నమస్తే శేరిలింగంపల్లి): ఐఎన్టీయూసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, సైబర్ సిటీ సర్కిల్ ప్రెసిడెంట్ కె. వెంకటేశ్వర్లు తన జన్మదినం సందర్భంగా గురువారం 33/11 కెవి లోధా సబ్ స్టేషన్ ఆవరణలో పునాస సపోటా మొక్కను నాటారు. సబ్ స్టేషన్ లో కార్మికులతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సైబర్ సిటీ సర్కిల్ సెక్రటరీ హెచ్ శ్యాంసుందర్, గచ్చిబౌలి డివిజన్ ప్రెసిడెంట్ రాజేందర్, డిజైన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నగేష్, డివిజన్ సెక్రెటరీ రామ్ రెడ్డి, ట్రెజరర్ భారత్ భూషణ్, కొండాపూర్ డివిజన్ సెక్రెటరీ రాజేందర్ నాయక్, మహేశ్ రాజ, వెంకటేష్ గౌడ్, నాగరాజు, కుమార్, కార్మికులు పాల్గొన్నారు.






