హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): కరోనా నేపథ్యంలో త్వరలో జరగాల్సిన హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనను వాయిదా వేశారు. ఈ మేరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్ష, కార్యదర్శులు జూలూరు గౌరీశంకర్, కోయ చంద్రమోహన్ లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సానుకూల పరిస్థితులు ఏర్పడిన తర్వాత హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతానికి పుస్తక ప్రదర్శనను వాయిదా వేస్తున్నట్లు తెలియజేశారు.