శేరిలింగంపల్లి, మే 9 (నమస్తే శేరిలింగంపల్లి): సమాజంలో పుస్తకాల పట్ల అవగాహన పెంచాలని శేరిలింగంపల్లి శాసనసభ్యుడు ఆరెకపూడి గాంధీ అన్నారు. ప్రస్తుతం సెల్ఫోన్లలో లీనమైపోయే సంస్కృతికి ప్రజలు అలవాటు పడిపోయారని, ఇటువంటి సందర్భంలో తెలంగాణ బుక్ ట్రస్ట్ ముందుకు వచ్చి రాష్ట్రవ్యాప్తంగా పుస్తక ప్రదర్శ కార్యక్రమాలను బ్రహ్మాండంగా నడిపిస్తుందని తెలియజేశారు. ఈ నెల 16 నుంచి 25వ తేదీ వరకు తెలంగాణ బుక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని శేరిలింగంపల్లిలో మెట్రో బుక్ ఫెయిర్ జరగనుందని అన్నారు. ఈ నేపథ్యంలో ఆరెకపూడి గాంధీ మెట్రో బుక్ఫెయిర్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ, హైదరాబాద్లో జరిగే మెట్రో బుక్ ఫెయిర్ను పుస్తక ప్రియులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. బుక్ ఫెయిర్లో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా, పుస్తకాల పట్ల అవగాహన అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బుక్ట్రస్ట్ నిర్వాహకులు కోయ చంద్రమోహన్, ప్రైవేట్ విద్యాసంస్థల(ట్రెస్మ) రాష్ట్ర చైర్మన్ శివరాత్రి యాదగిరి, ఏఐఎఫ్డీవై రాష్ట్ర నాయకులు వనం సుధాకర్, ఇస్లావత్ దశరథ్ నాయక్, స్థానిక కాంగ్రెస్ నాయకులు చంద్రకాంత్ రావు తదితరులు పాల్గొన్నారు.