శేరిలింగంపల్లి, మే 9 (నమస్తే శేరిలింగంపల్లి): వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు గాను మాదాపూర్ డివిజన్ పరిధిలోని పలు చోట్ల డి సురేష్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రోజువారి కూలీలు, కార్మికులకు మజ్జిగను, రూ అఫ్జాను పంపిణీ చేశారు. ట్రస్ట్ మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు డి.నగేష్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కార్మికులకు మజ్జిగను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో రోజువారి కార్మికులు, కూలీలు దాహం తీర్చుకోవడం కోసం ఎంతో ఇబ్బంది పడుతుంటారని, అందుకనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు.