శేరిలింగంపల్లి, మే 26 (నమస్తే శేరిలింగంపల్లి): భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) సుభాష్ చంద్రబోస్ నగర్, మసీద్ బండ శాఖ నాలుగో మహాసభను సిపిఐ మండల కార్యాలయం ఇజ్జత్ నగర్ లో ఎస్.కొండలయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ శేరిలింగంపల్లి నియోజకవర్గం కార్యదర్శి రామకృష్ణ హాజరై మాట్లాడుతూ గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తా అని చెప్పి మరిచిపోయింది. ఈ ప్రభుత్వమైనా డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వకపోతే ప్రభుత్వ భూమిలో భూ పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ పేదవారికి సొంతిల్లు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. 80 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఇల్లు కోసం పోరాటాలు చేయడం కోసం ప్రజలు కమ్యూనిస్టు పార్టీలో ఎర్రజెండాలు పట్టుకొని కదం తొక్కుతున్నారని అన్నారు. పేదలకు సొంతింటి కల నెరవేర్చే వరకు ప్రభుత్వంపై అలుపు ఎరుగని పోరాటాలు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీలను రామకృష్ణ ప్రకటించారు. సుభాష్ చంద్రబోస్ నగర్ శాఖ కార్యదర్శిగా బి నారాయణ, సహాయ కార్యదర్శిగా సాయి తేజ, మసీదు బండ శాఖ కార్యదర్శిగా శ్రీనయ్య, సహాయ కార్యదర్శిగా లక్ష్మణ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.