శేరిలింగంపల్లి, మే 7 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని రెడ్డి కాలనీ లో ఉన్న శ్రీ సీతారామంజనేయ దేవాలయం లో ఆర్య వైశ్య మహాసభ, IVF, ఐక్య వేదిక, ఆర్య వైశ్య సంఘం చందానగర్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మ వారి జయంతి వేడుకలలో భాగంగా నిర్వహించిన కళశ యాత్ర, కుంకుమ పూజ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ డివిజన్ సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి , ఆర్య వైశ్య సంఘం సభ్యులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం సభ్యులు పబ్బ మల్లేష్ గుప్తా, పసుమర్తి శ్రీనివాస్ గుప్తా, దారా లక్ష్మణ్ గుప్తా, కే ఎస్ సంపత్ కుమార్ గుప్తా,.జయకృష్ణ గుప్తా, నటరాజ్ గుప్తా, బడంపేట్ వెంకటేష్ గుప్తా, వనమా శ్రీనివాస్ గుప్తా,. పబ్బ శ్రీనివాస్ గుప్తా, ఐత భాస్కర్ గుప్తా,.చిన్నం సత్యనారాయణ గుప్తా, కోటేశ్వర రావు, పృధ్వీ గుప్తా, కే వి గుప్తా, జయకిశోర్ గుప్తా, నటరాజు గుప్తా, లక్ష్మి, అన్నపూర్ణ, గాయత్రీ, లలిత, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.