శేరిలింగంపల్లి, మే 22 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్లోని శ్రీ ధర్మపురి క్షేత్రంలో హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సువర్చలా కల్యాణం, స్పందన ఆర్ట్స్ ఆధ్వర్యంలో రామదాసు శిష్య బృందంచే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. డాక్టర్ శ్రీకాంత్ గౌడ్, డాక్టర్ రవికుమార్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ ధర్మపురి క్షేత్రం వ్యవస్థాపకురాలు భారతీయం సత్యవాణి, డాక్టర్ వీఎస్ శివ ప్రసాద్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.