హ‌ఫీజ్‌పేట్‌లోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి బిజెపి నేత‌లు… వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించాల‌ని డిమాండ్‌…

నమ‌స్తే శేరిలింగంప‌ల్లి: హఫీజ్‌పేట్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బిజెపి నాయ‌కులు మంగ‌ళ‌వారం సంద‌ర్శించారు. ఆరోగ్య‌కేంద్రం వైద్యాధికారి డాక్ట‌ర్ విన‌య్‌బాబుతో తాజా ప‌రిస్థితుల‌పై చర్చించారు. బిజెపి హఫీజ్‌పేట్‌, మియపూర్ డివిజన్‌ల‌ ఆధ్వర్యంలో డాక్ట‌ర్లకు, వ్యాక్సినేషన్ సిబ్బందికి జ్యూసులను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు బుచ్చిరెడ్డిలు మాట్లాడుతూ మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఉచితంగా టీకాలు(వాక్సినేషన్) వేయిస్తామని ప్రకటించారని అన్నారు. ఈ క్ర‌మంలో యావ‌త్ జాతి వారికి ధన్యవాదాలు తెలపాల‌ని అన్నారు. దేశ ప్రజల ఆరోగ్యం గురించి మోడీ ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో ఈ నిర్ణయంతో అర్ధమవుతుందని అన్నారు. కరోనా నుంచి దేశ ప్రజలను కాపాడటమే కేంద్ర ప్రభుత్వం మొట్ట మొదటి ప్రాధాన్యత అని, ఎన్ని లక్షల కోట్లు ఖర్చైనా దేశ ప్రజలకు వ్యాక్సినేష‌న్ ఇవ్వాల‌నే సంకల్పంతో కేంద్ర ప్ర‌భుత్వం ముందుకు సాగుతుంద‌ని అన్నారు. ఐతే అని రాష్ట్రలలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుంద‌ని, మన రాష్ట్రంలో ఇంకా జరగడం లేద‌ని అన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని యుద్ధప్రాతిపదికన వ్యాక్సినేష‌న్‌కు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరారు. అలాగే ప్రతి ఒక్కరు స్వచ్చందంగా ముందుకు వచ్చి కరోనా వాక్సిన్ తీసుకుకోవాలని అయన కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు, మణిక్ రావు, నాయ‌కులు నారాయణరెడ్డి, లక్ష్మణ్, శ్రీనివాస్ యాదవ్, విజేందర్,సాంబ శివ రావు,రఘు నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

వైధ్యాధికారి డాక్ట‌ర్ విన‌య్‌బాబుతో మాట్లాడుతున్న బిజెపి నాయ‌కులు జ్ఞానేంద్ర ప్ర‌సాద్‌, బుచ్చిరెడ్డి త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here