నమస్తే శేరిలింగంపల్లి: గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ చైర్మన్ ధనలక్ష్మి జన్మదినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, చందానగర్ కార్పొరేటర్ మంజుల రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, తెలుగు సినిమా ఫెడరేషన్ అధ్యక్షులు నాగ బాలా సురేష్, నాని, ట్రస్ట్ డైరెక్టర్ శ్రీధర్, ట్రస్ట్ సభ్యులు, సీనియర్ నాయకులు, బంధుమిత్రులు గుడ్ల ధనలక్ష్మి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కులమతాలకు అతీతంగా వేద పండితులు మంత్రోచ్ఛరణలతో ఆశీర్వదించగా పలువురు ప్రార్థనలు చేశారు. జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అయ్యప్ప దీక్ష తీసుకున్న 650 మంది స్వాములకు అన్నదానం చేశారు. సాయి సేవా ఆశ్రమంలో చిన్నారులకు, వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు.

