ప‌ట్ట‌భ‌ద్రులు ఓట‌ర్లుగా న‌మోదు చేసుకోవాలి: కార్పొరేట‌ర్‌ జానకి రామరాజు

హైద‌ర్‌న‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రానున్న హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ బలబర్చిన అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని హైద‌ర్‌న‌గ‌ర్ డివిజ‌న్‌ కార్పొరేటర్ జానకి రామరాజు పిలుపునిచ్చారు. ఆదివారం అల్లాపూర్ సొసైటీ, విజేత గ్రీన్ హోమ్స్, ప్రశాంత్ నగర్ ల‌లో కార్పొరేట‌ర్‌ జానకి రామరాజు ఇంటింటికి తిరుగుతూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారితో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లుగా స్వయంగా నమోదు చేయించారు.

ఓట‌రు న‌మోదు ప‌త్రాల‌ను స్వీక‌రిస్తున్న కార్పొరేట‌ర్‌ జానకి రామరాజు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టభద్రుల ఓటర్లుగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు విధిగా నమోదు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుకు వార్డ్ మెంబర్స్, ఏరియా కమిటీ మెంబర్స్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.

ఏరియా కమిటీ మెంబర్ శేషయ్య, బస్తీ కమిటీ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు రంగనాథ రాజు, రవికుమార్, రమణారెడ్డి, సంగమేశ్వర రావు, వెంకట్ రావు, లోకేశ్వర రావు, విజయ భాస్కర్ రెడ్డి, రమేష్, మహేష్, మూర్తి రాజు, ప్రభాకర్ రెడ్డి, సుబ్బారావు, భూపాల్ రెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here