విజయనగర్ కాలనీలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ బస్తీ బాట

ఆల్విన్ కాల‌నీ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ విజయనగర్ కాలనీలో స్థానిక సమస్యలపై కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ స్థానిక నాయకులతో కలిసి బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు డ్రైనేజీ విస్తరణ పనులు, తాగునీటి సరఫరాతో ఇబ్బందులు పడుతున్నామని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ అధికారులకు సమాచారం ఇచ్చి సమస్య పరిష్కారానికి కృషిచేయాలని ఆదేశించారు.

విజ‌య‌న‌గ‌ర్ కాల‌నీలో బ‌స్తీబాట నిర్వ‌హిస్తున్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

ఈ కార్యక్రమంలో యువ నాయకుడు రామకృష్ణ గౌడ్, డివిజన్ తెరాస అధ్యక్షుడు జిల్లా గణేష్, వార్డు మెంబర్ కాశీనాథ్ యాదవ్, బీసీ అధ్యక్షుడు రాజేష్ చంద్ర, నాయకులు మున్నా, గుడ్ల శీను, నాగరాజు, చోటా మున్నా, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు రాజిరెడ్డి, మురళీకృష్ణ, సుబ్బారావు, స్వరూప, లావణ్య, రవి తదితరులు పాల్గొన్నారు.

కాల‌నీవాసుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకుంటున్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here